Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : అరకు రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ కింద పునరాభివృద్ధి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశంలో 544 రైల్వేస్టేషన్ లను పునరాభివృద్ది చేసేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు . దీనిలో భాగంగా సోమవారం అమృత్ భారత్ స్టేషన్ లకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. అలాగే 1500 రైల్వే ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లకు భూమి పూజ నిర్వహించారు. దీనిలో భాగంగా అరకు రైల్వే స్టేషన్ ను కూడా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి చేసేందుకు పీఎం మోదీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పధకం లో భాగంగా 554 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేయనుండగా, ఆంధ్రప్రదేశ్ లో 46 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి జరగనుంది. దీనిలో బాగా అరకులోయ రైల్వే స్టేషన్ ను 16 కోట్ల రూపాయలతో పునరాభివృద్ధి చేయనున్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్ భవన విశిష్ట మాట్లాడుతూ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అరకు రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి జరగనుండడం ఆనందంగా ఉందన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం లో భాగంగా రైల్వే స్టేషన్లను ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలనే దేశ ప్రధాని మోదీ ఆలోచన అని అన్నారు.
Admin
Rapid TV