Rapid TV - Andhra Pradesh / Anakapally : డీఆర్డీఏ వెలుగు ఉద్యోగుల ధర్నాకు దాడి రత్నాకర్ సంఫీుభావం... న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు పోరాటం సాగించాలి.. మీ పోరాటానికి మా పూర్తి సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి టీడీపీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్.. మీ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు శాంతియుతంగా పోరాటం కొనసాగించాలని, మీ పోరాటానికి మా సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక నెహ్రూచౌక్ జంక్షన్లో డీఆర్డీఏ వెలుగు సిబ్బంది తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన దీక్షా శిబిరాన్ని బుధవారం రత్నాకర్ సందర్శించి సంఫీుభావం తెలియజేశారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఎవరి హక్కులకు భంగం కలిగినా పోరాడి సాధించుకొనే హక్కు ఉందన్నారు. ఈ హక్కును ఉల్లంఘించే అధికారం ఏ ప్రభుత్వానికిగాని, అధికారులకుగానీ లేదన్నారు. మిమ్మల్ని భయబ్రాంతులను చేయడానికి, మీ పోరాటానికి నీరుగార్చేందుకు మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తామని, ఎస్మా ప్రయోగిస్తామని చెప్పినా ఎవరూ భయపడాల్సిన పనిలేదని, ఎందుకంటే మరికొన్ని రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్నే ప్రజలు ఇంటికి పంపించడానికి సిద్దంగా ఉన్నారన్నారు. రోడ్డుపైకి వచ్చి టెంట్వేసి ధర్నా చేపడితే తప్ప మీ సమస్యలు పరిష్కరించడానికి ఏ ప్రభుత్వం, అధికారి స్పందించి మీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకొనే పరిస్థితులు ఉండవన్నారు. మీ సమస్యల పరిష్కారం కోసం, సంక్షేమం చేస్తున్న పోరాటం ఏ వ్యక్తి మీదో, వైసీపీ పార్టీ మీదో కాదని ఈ ప్రభుత్వంపైనే అని, దీనికి ప్రభుత్వం తప్పక తలొగ్గి మీ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి దిగి రావాల్సిందే అన్నారు. మీరు చేస్తున్న పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు, అధికారులు సంఫీుభావం తెలపాల్సిన బాధ్యత ఉందని రత్నాకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.శ్రీనివాసరావు, వై.బాలరాజు, బి.రామకృష్ణ, ప్రకాష్, సాయి రమేష్, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Rapid TV