Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ, అనకాపల్లి:: రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్ ప్రజా శ్రేయస్సు కోరుతూ ఆదివారం తన స్వగృహంలో కుటుంబసమేతంగా సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు ధారణలో సుదర్శన, లక్ష్మీ నరసింహ యాగం, లక్ష్మీ గణపతి యాగం, మృత్యుంజయ యాగం, మహా శాంతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఎం రమేష్ గారు మాట్లాడుతూ లోకకళ్యాణార్థం ప్రతిసంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా మా నివాసంలో కుటుంబసమేతంగా మహా శాంతి హోమం ఘనంగా నిర్వహించామని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కేంద్రంలో, రాష్ట్రంలో ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఘనంగా వర్ధిల్లాలని, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్ధించినట్లుగా పేర్కొన్నారు.
Admin
Rapid TV