Rapid TV - Andhra Pradesh / Anakapally : మీడియా పై దాడులను ఖండిస్తూ APWJF ధర్నా అనకాపల్లి : పత్రికా కార్యాలయాలు, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఫెడరేషన్ బుధవారం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడండి... మీడియా పై దాడులను అరికట్టండి అంటూ పాత్రికేయులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు భీమరశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ. రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలను అధికార పార్టీ వర్గాలు టార్గెట్ చేసుకుని వరుస దాడులకు పాల్పడుతున్న ప్రభుత్వం చోద్యం చూస్తుండడం విచిత్రంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి కాని, మంత్రులు కాని ఈ దాడులను ఖండించకపోవడం చూస్తుంటే అధికార పార్టీ తెర వెనుక ఉండి ఈ దాడులను ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తుందని అన్నారు. మీడియా పై దాడులు ఆపకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉదృతమైన ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో చిన్ని కృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బి. కొండలరావు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, కార్యదర్శులు పి. నాగ శ్రీను, పి. రామారావు, సీనియర్ పాత్రికేయులు, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు ఎస్.కె చాంద్ బాషా, తిమ్మాపాత్రుని రమేష్, సీనియర్ పాత్రికేయులు కాండ్రేగులమోహన్ బాబు, కే. చంద్రశేఖర్, పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు గంటా శ్రీనివాస్, మోల్లేటి గంగాధర, నటరాజ్, శశి, జగదీష్, గణేష్, నానాజీ, షణ్ముఖ లక్ష్మణ్, గోపాల్, అప్పారావు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV