Rapid TV - Andhra Pradesh / Anakapally : అంగన్వాడి కార్యకర్తల చలో విజయవాడ మరియు తాడేపల్లి క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమం లకు అనుమతులు లేవు అని అనకాపల్లి జిల్లా ఎస్పీ కె.వి. మురళీకృష్ణ ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. అంగన్వాడీ కార్యకర్తలు తలపెట్టిన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడి మరియు చలో విజయవాడకు అనుమతులు లేనందున అంగన్వాడి కార్యకర్తలు సమూహాలుగా విజయవాడ వెళదామనే ఆలోచనను విరమించుకుని పోలీసులకు సహకరించాలని మరియు పలువురి రెచ్చగొట్టే మాటలకు స్పందించి ఎటువంటి హింసాత్మకమైన నిరసన కార్యక్రమాలలో పాల్గొన రాదని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనరాదని, పోలీసులకు సహకరించి సమయమనం తో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలకు మరియు నాయకులకు విజ్ఞప్తి చేశారు.
Admin
Rapid TV