Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి అచ్చుతాపురం : మండల మహాసభలో అచ్యుతాపురం నూతన కమిటీ కన్వీనర్ గా ఆర్ .రాము ను మండల కమిటీ సభ్యులుగా కర్రీ .అప్పారావు, కోండ్రపు. సోమనాయుడు, బి. రామ్ కుమార్ ,ఎస్ .రామ్ నాయుడు, చేపల .తాతయ్య, జయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా మండల కన్వీనర్ ఆర్ .రాము మాట్లాడుతూ నవంబర్ 8 నుంచి 15 వరకు పెరిగిన ధరలకు నిరసనగా ప్రజలు, కార్మికులు , రైతులు, వృత్తిదారులు, దళితులు, చిల్లర వర్తకల్లో విస్తృత క్యాంపెయిన్ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ధరలు తగ్గించాలని రాబోయే కాలంలో సమస్యలపై విస్తృతంగా పోరాటాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎస్ ఈ జెడ్, ఫార్మా, బార్క్ ,ఎన్టిపిసి లో స్థానికులకు 75 శాతం ఉపాధి కల్పించాలని, చినపూడి ,దుప్పుతురు గ్రామాలను తరలించాలని నిర్యాసితులకు పెండింగ్ ప్యాకేజీ ,మేజర్ సన్స్ కు ఇల్లు స్థలాలు ఇవ్వాలని, అచ్యుత పురం టు అనకాపల్లి రోడ్డు విస్తరణలో భూములు, ఇల్లు, స్థలాలు కోల్పోయిన నిర్యాసితులు కు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు న్యాయం చేయాలని , మత్స్యకారులకు మత్స్యకార భరోసా నిధులు ఇచ్చి ,పరిశ్రమల నుండి విడుదలయ్యే పొల్యూషన్ ను అరికట్టాలని ,ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించి కనీస వేతనాలు ఇవ్వాలని, పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ,అభిజిత్ కార్మికులకు న్యాయం చేయాలని ,భూమి సమస్యలు, చేతివృత్తిదారులు, రహదారులు, మంచినీరు, పారిశుద్ధ్యం , సాగునీరు, వంటి మౌలిక సదుపాయాలు పైన, ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందించాలని, తదితర సమస్యలపై పోరాటాలూ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్ .రామసదాశివరావు, చోడిపల్లి. అప్పారావు నాయుడు, దేవుడమ్మ, ప్రశాంత్ ఆర్. లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV