Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి మండలం రేబాక ఎంపీయుపీ పాఠశాలలో శుక్రవారం ఏర్పాటుచేసిన జగనన్న ఆరోగ్య సురక్ష 2ను ముఖ్య అతిథి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గొర్లి సూరిబాబు ప్రారంభించారు. గతంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష మొదటి విడత విజయవంతం అయిందని ఈరోజు రెండవ విడత జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభించామని ఆయన అన్నారు దీని ద్వారా గ్రామంలో ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులోకి వస్తుందని వైద్య నిపుణులచే ప్రతి జబ్బుకి ప్రత్యేక చికిత్స ఉంటుందని తెలిపారు. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పేదవాడి ఆరోగ్యం మెరుగవుతుందని ఖరీదైన వైద్యం పేదవారికి ఉచితంగా లభిస్తుందని అన్నారు. పేదవాడిని దృష్టిలో ఉంచుకొని ఇటువంటి పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎంపీపీ గొర్లి సూరిబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష లో ఏర్పాటు చేసిన రక్తహీనత ఉన్న పిల్లలు, గర్భిణీల పట్టికను పరిశీలించారు, ఎంపీపీ గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మార్టూరు సన్యాసమ్మ ఎంపీటీసీ మంత్రి సంతోషం, మార్టూరు భాస్కరరావు, మంత్రి సత్యనారాయణ, సచివాలయం కన్వీనర్ కోనా కిషోర్ కుమార్, ఎంపీడీవో కే నరసింహారావు, కే ధర్మారావు, స్పెషలిస్ట్ డాక్టర్లు, గ్రామ కార్యదర్శులు, అంగన్వాడి సూపర్వైజర్లు వాలంటీర్లు, హెల్త్ సూపర్వైజర్లు సచివాలయం సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Admin
Rapid TV