Rapid TV - Andhra Pradesh / Anakapally : మార్చి 17వ తేదీ నుండి ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి నూకాలమ్మ జాతర ప్రారంభమవుతుందని ఆలయ చైర్మన్ పీలా నాగ శ్రీను తెలిపారు. మంగళవారం నూకాలమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈనెల మార్చి 17వ తేదీ నుంచి నెల రోజులపాటు ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి నూకాలమ్మ జాతర మహోత్సవాలు జరుగుతాయని అన్నారు. గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో జాతర మహోత్సవాలు జరుగుతాయని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ గారి సూచనలు సలహాలు మేరకు ఆయన సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్, ఈవో, నూకాంబిక దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Admin
Rapid TV