Rapid TV - Andhra Pradesh / Anakapally : ఉచిత అమృతం మోగా ఆయుర్వేద వైద్య శిభిరానికి విశేష స్పందన - 150 రోగులకు ఉచిత వైద్యసేవలు, మందులు పంపిణీ యలమంచిలి/రాంబిల్లి, న్యూస్ : మండలంలోని అప్పన్నపాలెం కాలనీ సమీపంలోని టెంట్ హౌస్ అప్పారావు కిరాణాషాపు వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత అమృతం మెగా ఆయుర్వేద వైద్యశిభిరానికి విశేష స్పందన లభించింది. నిర్వాహకులు శెశెట్టి అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉచిత మెగా ఆయుర్వేద వైద్య శిబిరంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ కమలాకర్ పురిపండ, డాక్టర్ హేమంత్ కుమార్, డాక్టర్ వివి. మాధురీ, దిమిలి పిహెచ్ ఆరోగ్యపర్యవేణ అధికారి సిహెచ్ ధనరాజులు రోగులను వైద్యపరీక్షలు ని ర్వహించారు. ఒళ్ళుకీళ్ళు నొప్పులు, పక్షవాతం, నరాలబలహీనత, చర్మ సమస్యలు, ఫైల్స్, స్త్రీల సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలుతో బాద పడుతున్న సుమారు 150 మంది రోగులను పరిక్షించి మందులను ఉచితంగా అందజేశారు. రోగులకు ఆరోగ్య సూత్రాలను తెలియజే శారు. ఉయదం 9 గంటలు నుంచి మద్మాహ్నం 3 గంటలు వరకు జరిగిన ఈ ఉచిత వైద్యశిభిరంను స్థానికులే కాకుండా సమీప గ్రామాలకు చెందిన రోగులు సద్వినియోగం చేసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వహకుడు అప్పారావును రోగులు “అభినందించారు. ఈ కార్యక్రమంలో స్తానిక పెద్దలు, రోగులు, నిర్వాహకులు అప్పారావు కుటుంభ సభ్యులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV