Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడి టీవీ అనకాపల్లి:: అనకాపల్లి జిల్లా: యలమంచిలి నియోజకవర్గం, యలమంచిలి నియోజకవర్గంలోని ఎలమంచిలి అచ్యుతాపురం రాంబిల్లి మునగపాక మండలాలలో జరిగిన పెన్షన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ లో ఇచ్చిన మాట ప్రకారం మూడు నెలలు కలిపిమొత్తం 7000 ఇవ్వడం జరుగుతోందని, ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ ఆనందంతో స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వం నెలకు 1000 రూపాయలు పెంచుతామని మాట ఇచ్చి 250 రూపాయలు పెంచి లబ్ధిదారులకు సుమారు 32000 రూపాయలు ఇవ్వకుండా చేయడం వలన లబ్ధిదారుడు నష్టపోయారని అన్నారు. యలమంచిలి మున్సిపాలిటీలో 13 సచివాలయాలు పరిధిలో 5654 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. యలమంచిలి రూరల్ లో 10 సచివాలయ పరిధిలో 4338 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అచ్యుతాపురం మండలంలో 22 సచివాలయం పరిధిలో 11010 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మునగపాక మండలంలో 21 సచివాలయాలు పరిధిలో 8560 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Rapid TV