Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ ఆగస్టు 31:: అనకాపల్లి జిల్లాలో ఒకరోజు ముందుగానే ఈనెల 31వ తేదీ (శనివారం) ఉదయం 6 గంటలకి ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం. ఒకవైపు వర్షం పడుతున్న లెక్కచేయకుండా అధికారులు నాయకులు దగ్గరుండి ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కార్యక్రమం చేపట్టారు. స్వయంగా జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ తన చేతులతో పెన్షన్ అందించారు. ఎప్పటికప్పుడు అధికారులకు, సిబ్బందికి ఆమె దిశానిర్దేశం చేశారు. ఉదయం 11:15 గంటల కల్లా జిల్లావ్యాప్తంగా 2,27,395 మంది లబ్ధిదారులకు మొత్తం నగదు రూ. 93 కోట్ల 69 లక్షల 29 వేలు (86.86%) పంపిణీ చేయడం జరిగింది.
Admin
Rapid TV