Sunday, 26 July 2026 01:46:01 AM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

యలమంచిలి పట్నం లో విద్యార్థుల ధర్నా

Date : 23 October 2024 08:26 PM Views : 267

Rapid TV - Andhra Pradesh / Anakapally : విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు వెంటనే చెల్లించాలి - ఎస్ఎఫ్ఐ యలమంచిలి, న్యూస్ : ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో యలమంచిలి ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కాలేజీల నుండి విద్యార్థులు స్వచ్ఛందంగా కాలేజీలను బహిష్కరించి పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగిందని అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఎం బాలాజీ అన్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఎం బాలాజీ, డివిజన్ సెక్రెటరీ కె మణికంఠ, డివిజన్ ప్రెసిడెంట్ కే కేశవ లు మాట్లాడుతూ విద్యార్థులకు ఇవ్వవలసిన విద్యా దీవెన, వసతి దీవెన అమ్మబడి ఇంకా బకాయిలు పెండింగ్ ఉండడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని కాలేజీల్లో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. అదేవిధంగా కాలేజీలో ఎగ్జామ్ ఫీస్ కట్టేందుకు విద్యార్థులు వెళితే కాలేజీ ఫీజు చెల్లిస్తే తప్ప మేము కట్టించుకోమని యాజమాన్యం అంటుందని వీటిపైన ప్రభుత్వ వెంటనే స్పందించి వెంటనే బకాయిలు చెల్లించాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ లో ఉన్న బకాయిలు విడుదల చేయకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు శరణ్య, జాహ్నవి, సంధ్య, రత్నం, భవాని, రవి, రాము, లక్ష్మణ్, బాలు, గని, దాసు, కృపానంద, మహేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: