Rapid TV - Andhra Pradesh / Anakapally : అసెంబ్లీలో సభాపతి అయ్యన్నపా త్రుడు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మంగళవారంనాటి శాసనసభ సమావేశంలో అచ్చ తెలుగులో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించే సమ యంలో సభాపతి సాధారణంగా ఆంగ్ల పదాలు ఉపయోగిస్తారు. అప్పుడు కూడా అయ్యన్నపాత్రుడు అచ్చంగా తెలుగులోనే మాట్లాడారు. తీర్మానానికి అనుకూలంగా ఉన్నవారు 'అవును' అనాలని సభ్యులను కోరారు. దీంతో సభ్యులంతా అవును అంటూ సమ్మతి తెలిపారు. చివరగా సభ వాయిదా వేయడమైనదంటూ తెలుగులోనే ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు సభాపతిని ప్రశంసించారు. మాతృభాషకు ఆయన ఇచ్చే గౌరవాన్ని కొనియాడారు
Reporter
Rapid TV