Rapid TV - Andhra Pradesh / Anakapally : ఉచిత మేగా కంటి వైద్య శిబిరం శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి విశాఖపట్నం మరియు రాజా ఆప్టికల్ & కంటి ఆస్పత్రి వారి ఆధ్వర్యంలో అనకాపల్లి ఏ ఎం ఏ ఏ హై స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15 తేదీ గురువారం నాడు ఉచిత మేగా కంటి వైద్య శిబిరం జరుగుతుందని రాజా ఆప్టికల్స్ & కంటి ఆసుపత్రి అధినేత పూసర్ల రాజా తెలియజేశారు. ఈ కంటి వైద్య శిబిరంలో అత్యధికమైన కంప్యూటర్లపై కంటి వైద్య నిపుణులతో కంటి పరీక్షలు నిర్వహించబడతాయని తెలియజేశారు. ఈ కంటి వైద్య శిబిరంలో కంటికి సంబంధించిన అన్ని రకముల వ్యాధులకు అనగా కళ్ళు మసకగా కనబడుట, కళ్ళ నుండి నీరు కారుట, కళ్ళు ఎరుపుగా అవుట, కళ్ళు దురద పుట్టుట, దగ్గర చూపు దూరము చూపు సరిగా కనిపించకపోవడం, కంటిపై వచ్చే కండ, మెల్లకన్ను సరిచేయుట, 14 సంవత్సరముల లోపు పిల్లలకు క్యాటరాక్ట్( శుక్ల0), షుగర్ వ్యాధిగ్రస్తులకు వచ్చే కంటి నరం వ్యాధులకు, కంటి గుడ్డి కి సంబంధించిన కొన్ని వ్యాధులకు, నల్లగుడ్డు మార్పిడి వంటి వ్యాధులకు ఉచితంగా పరీక్షలు మరియు శస్త్ర చికిత్సలు చేయబడునని తెలియజేశారు. మరియు అవసరమైన వారికి మందులు ఉచితముగా ఇవ్వబడును అని అన్నారు. ఆపరేషన్ అవసరమైన వారిని అదే రోజు శంకర్ ఫౌండేషన్ బస్సులో విశాఖపట్నం తీసుకుని వెళ్ళబడునని తెలియజేశారు. కళ్ళజోడు అవసరమైన వారికి 50% తగ్గింపుతో అనకాపల్లి లో వున్న రాజా ఆప్టికల్స్ & కంటి ఆస్పత్రి వారి ద్వారా ఇవ్వబడునని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు రుసుము తీసుకోకుండా అన్ని కంటి తనిఖీలు మరియు అత్యాధునికమైన పద్ధతిలో కంటి ఆపరేషన్లు నిర్వహించబడును పూసర్ల రాజా తెలియజేశారు. ఈ కంటి వైద్య శిబిరంలో ఆరోగ్య భద్రత ఏపీ ఈపీడీసీఎల్ మరియు ఈసిహెచ్ఎస్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు కూడా ఉచిత కంటి తనిఖీలు చేయబడినని ఉద్యోగులు వారి మెడికల్ హెల్త్ కార్డు తప్పనిసరిగా తీసుకొని రావాలని తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా ఆయన కోరారు.
Admin
Rapid TV