Rapid TV - Andhra Pradesh / Anakapally : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దాడి రత్నాకర్ సహాయ సహకారాలతో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరము, ఉచిత కంటి వైద్య శిబిరాన్ని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి భాస్కరరావు సందర్శించారు. శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి విశాఖపట్నం, రాజా ఆప్టికల్స్ కంటి ఆసుపత్రి అనకాపల్లి వారి ఆధ్వర్యంలో ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో ప్రతి ఒక్కరికి మందులను, అవసరమైన వారికి కళ్ళజోళ్లను దాడి రత్నాకర్ ఆర్థిక సాయంతో ఉచితముగా అందజేశారు. కంటి శుక్లాల ఆపరేషన్లను ఉచితముగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిచూరి భాస్కరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా రత్నాకర్ ఏర్పాటుచేసిన ఈ రక్తదాన శిబిరాన్ని ఉచిత కంటి వైద్య శిబిరాన్ని చూసి రత్నాకర్ ను అభినందించారు. ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్న రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు, పేదవాళ్లకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఎంతోమందికి కంటి చూపు ను ప్రసాదించిన రత్నాకర్ లాంటి యువ నాయకులు మనకు చాలా అవసరం అని అన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన విద్యార్థిని విద్యార్థులకు స్థానికులకు పరుచూరి భాస్కరరావు చేతుల మీదుగా సర్టిఫికెట్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసి మరియు సేవలందించిన డైట్ కళాశాల విద్యార్థిని విద్యార్థులను పరుచూరి భాస్కరరావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గణేష్, మంగా ఈశ్వర్, గంటా గోవింద్ అనకాపల్లి మండల అధ్యక్షులు సత్య రావు మరియు జనసైనికులు పాల్గొన్నారు
Admin
Rapid TV