Sunday, 26 July 2026 01:45:15 AM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

కర్రివానిపాలెంలో రైతు పూజోత్సవం

జీడి ఫౌండేషన్ తేజ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైతులకు సన్మానం

Date : 24 June 2024 11:37 AM Views : 286

Rapid TV - Andhra Pradesh / Anakapally : *కర్రివాని పాలెం లో రైతు పూజోత్సవం* ఎస్.రాయవరం : ఏరువాక పౌర్ణమ సందర్భంగా జె.డి ఫౌండేషన్ ,తేజ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం కర్రివానిపాలెం రైతులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తేజ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు దూలపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆహారం పండించే రైతును గౌరవించే ఉద్దేశ్యం తో జె.డి ఫౌండేషన్ రైతుల ను సన్మానించే కార్యక్రమం ను రూపు దిద్దారని పేర్కొన్నారు. దీనిలో భాగంగా కర్రి వాని పాలెం గ్రామంలో ఏరువాక కార్యక్రమం నిర్వహించామన్నారు. కర్రి వాని పాలెం లో పోతు గోవిందరావు తో పాటు మరో 11 మంది రైతులకు పంచె ,టవలు ,స్వీట్ బాక్స్ ఇచ్చి పూలమాల తో సత్కరించడం జరిగింది.ముందుగా తేజా చారిటీ సభ్యులు పొలినాటి నానాజీ మాట్లాడుతూ ఎరువులు ,పురుగుల మందులు లేకుండా ప్రకృతి వ్యవసాయం చేసేలా రైతులు అడుగులు ముందుకు వేయాలని సూచించారు. అనంతరం బి.వి.వి.సత్యనారాయణ ,అక్కిరెడ్డి నాగేశ్వరరావు ,అప్పలరాజు లు రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతే రాజు గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా మా చారిటీ పనిచేస్తుందన్నారు.రైతులకు జె.డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా చారిటీ ద్వారా ఎటువంటి సహాయ సహకారాలు అందజేయడానికైనా సిద్ధంగా ఉంటామన్నారు. అంతకుముందు 12 మంది ఉత్తమ రైతులకు ప్రశంసా పత్రలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పోతు గోవిందరావు ,పినపాత్రుని వెంకటరమణ ,వీరవెంకట సత్యనారాయణ ,పోతు అచ్చియ్య దొర, మోహన రావు ,అప్పారావు ,మోకిన మహేశ్వర రావు ,పోతు రాము , ,గొర్లి రాము ,శ్రీను ,పులి ప్రసాద్ ,శ్రీనివాసరావు లు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: