Rapid TV - Andhra Pradesh / Anakapally : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద నమ్మకంతో మరియు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై అనకాపల్లి మండలం బట్టలపూడి గ్రామ పంచాయతీ వైసీపీ సర్పంచ్ గొంతుని సత్యారావు గారు తన అనుచరులతో ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు గారి సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా భాస్కర రావు గారు సత్యారావు గారికి జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సత్య రావు గారు మాట్లాడుతూ గత కొద్ది నెలలుగా జనసేన పార్టీ యొక్క ఎదుగుదలను గమనిస్తున్నానని అన్నారు. ముఖ్యంగా రైతుల విషయంలో ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు తనకు బాగా నచ్చి ఈరోజు పార్టీలోకి చేరుతున్నానని తెలిపారు. ఈ సందర్భంగా బట్టలపూడి గ్రామానికి చెందిన అధిక సంఖ్యలో మహిళలు కూడా జనసేన పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు గంజి సత్య రావు గారు, పండూరి సూర్యచందర్రావు గారు పాల్గొన్నారు.
Admin
Rapid TV