Rapid TV - Andhra Pradesh / Anakapally : నక్కపల్లి : నక్కపల్లి లో జనసేన నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో అనకాపల్లి జిల్లా కార్యదర్శి ఆకేటి గోవిందరావు మాట్లాడుతూ జనసేన టి.డి.పి పొత్తులో భాగంగా పాయకరావుపేట సీటు జనసేన కు కేటాయిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పొత్తులో టి డి.పి కి ఇచ్చినా సరే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు ఇక్కడ సీటును గెలిపిస్తామని తెలిపారు. పాయకరావుపేట లో వై.సి పి ఓటమి ఖాయమని చెప్పారు. పాయకరావుపేట లో జనసేన బలంగా ఉందని ఈ సీటు కు రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ పోటీ చేస్తే 50 వేల పై చిలుకు మెజార్టీ వస్తుందని అన్నారు. మా పాయకరావుపేట నియోజకవర్గం జనసేన నాయకులు ,కార్యకర్తలు శివదత్ కి ఎమ్మెల్యే సీటు రావాలని బలంగా కోరుకుంటున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో జన సైనికులకు ఏమైనా ఆపద వస్తే శివదత్ ముందుంటారని పేర్కొన్నారు.అనంతరం సీనియర్ నాయకులు బాబురావు మాస్టర్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి ఈ పార్టీలో చేరామన్నారు. అధినేత ఏమి చెబితే అది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వై.సి.పి విముక్తి ఆంద్రప్రదేశ్ కోసం జన సైనికులు పనిచేస్తారని అన్నారు. పొత్తులో భాగంగా టి.డి.పి నాయకులు ,కార్యకర్తల ను కలుపుకుని వెళ్లడం జరుగుతుందన్నారు.అంతకుముందు జిల్లా జాయింట్ సెక్రటరీ అప్పలరాజు మాట్లాడుతూ గత ఏడేళ్లుగా జనసేన పార్టీ కోసం కష్టబడ్డ శివదత్ కు సీటు ఇస్తే పాయకరావుపేట ఎమ్మెల్యే గా శివదత్ ను గెలిపించి పవన్ కళ్యాణ్ కు ,చంద్రబాబు కు గిఫ్ట్ గా ఇస్తామని తెలిపారు. వారి వెంట జనసేన నాయకులతో పాటు అధిక సంఖ్యలో జన సైనికులు ఉన్నారు.
Reporter
Rapid TV