Sunday, 26 July 2026 04:36:28 AM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

కాంగ్రెస్ పాలనలోనే దేశం అన్ని రంగాల్లోని అభివృద్ధి:: ఐ ఆర్ గంగాధర్

Date : 19 June 2024 12:25 PM Views : 372

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ: భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఐ.ఆర్. గంగాధర్ అన్నారు. బుధవారం అనకాపల్లి లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి 54వ జన్మదిన కార్యక్రమం ఘనంగా జరిగింది .ముందుగా జన్మదిన కేకును గంగాధర్ కట్ చేసి సభ్యులకు పంపిణీ చేశారు .ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అని గంగాధర్ తన ఆశ భావాన్ని వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని తన భుజాలపై వేసుకొని గల్లీ నుండి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కార్యకర్తలలో నూతన ఉత్సాహాన్ని పెంపొందించారని గంగాధరన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర దేశ ప్రజలను, ప్రజాస్వామికవాదులను, హక్కుల సంఘాలను ,దళిత, గిరిజన ,బీసీ, మైనార్టీలకు ఆశా దీపంగా కనిపించిందని గంగాధరన్నారు. కేంద్రంలో మోడీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ ఎంత కుటిల ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆపలేకపోయారని గంగాధరన్నారు .మతం పేరుతో రాజకీయాలను శాశ్వతం చేసుకోవాలని బిజెపి కలలు కన్నారని కానీ దేశ ప్రజలు వారు ప్రయత్నాలను తిరస్కరించాలని అన్నారు.బిజెపికి దేశ ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పారని గంగాధర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశానికి దిశా ,నిర్దేశం చేయగలదని గంగాధర్ అన్నారు. దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం రాహుల్ చేస్తున్న పోరాటంలో సైనికులు వలె పని చేస్తామని సమావేశంలో పాల్గొన్న సభ్యులందరూ ప్రమాణం చేశారు.ఈ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిల్లా కోటేశ్వరరావు ,అనకాపల్లి పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దాసరి సంతోష్, దాడి పరమేశ్వరరావు, యూత్ కాంగ్రెస్ నాయకులు కొల్లి సత్యారావు, కర్రి దుర్గాప్రసాద్, అల్లుమల్ల భాస్కర్, మహిళా కాంగ్రెస్ నాయకులు ఇందుర్తి గౌరీ, ఏడువకుల దేవుడమ్మ ,ఎరుకల హక్కుల పోరాట సంఘం కన్వీనర్ పూజారి నర్సయ్య, మొదలవారు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: