Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చియ్యపేట మండలం వడ్డాది గ్రామ సచివాలయం వద్ద వాలంటీర్లకు వందనం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి చోడవరం శాసనసభ్యులు ప్రభుత్వవిప్క రణం ధర్మశ్రీ హాజరయ్యారు ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలు చక్కగా చేసినటువంటి వాలంటీర్లకు ఆయన అవార్డు నగదు ప్రోత్సాహాలను అందించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఈ వ్యవస్థ పలువురికి ఆదర్శమైందని ఈ కార్యక్రమంలో సేవ చేసే వాళ్ళకి నగదు ప్రోత్సాహాన్ని ఇవ్వడం హర్షణీయమన్నారు. పనిచేసే కార్యకర్తలకు నాయకులకు వాలంటీర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ సముచితమైనటువంటి స్థానాన్ని ఇస్తారన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలోనూ ప్రభుత్వ కార్యక్రమాలను ఎక్కువ సేవాభావంతో పనిచేసినటువంటి వాలంటీర్లకు ఆయన సన్మానించి నగదు ప్రోత్సాహాలను అవార్డులను అందజేశారు కార్యక్రమంలో జడ్పిటిసి దొండా రాంబాబు ఇతర వైఎస్ఆర్సిపి నాయకులు హాజరయ్యారు
Admin
Rapid TV