Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV, నర్సీపట్నం : దేశ రక్షణలో ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ మృతి పట్ల గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ శాసనసభ నియోజకవర్గంలోని గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్, జమ్మూకాశ్మీర్లో పాకిస్థాన్ సైన్యం జరిపిన బాంబు దాడిలో వీరమరణం పొందారు. ఈ నేపథ్యంలో స్పందించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్ మృతి అత్యంత బాధాకరమని, ఆయన త్యాగం చిరస్థాయిగా గుర్తింపు పొందుతుందన్నారు. అమర వీరుడిగా నిలిచిన మురళి నాయక్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి సైనికుడి త్యాగం, దేశ ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలుస్తుందని ఆయన అన్నారు.
Reporter
Rapid TV