Rapid TV - Andhra Pradesh / Anakapally : చంద్రబాబునాయుడు పరిపాలన పవన్ కళ్యాణ్ నిబద్ధత నరేంద్ర మోడీ సహకారం పట్ల ప్రజలు సంపూర్ణ సహకారం విశ్వాసంతో తీర్పు ఇచ్చారని వారి యొక్క నమ్మకానికి విశ్వాసం ఇస్తూ ఈ తీర్పుకి అనుగుణంగా రాబోయే రోజుల్లో కూటమి యొక్క ప్రభుత్వ పాలన ఉంటుందని అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ శాసనసభ్యులు కేఎస్ఎన్ఎస్ రాజు అన్నారు. చోడవరం నియోజకవర్గ ప్రజలు 41,165 ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించినందుకు వారందరికీ కృతజ్ఞతలు అని, నా గెలుపుకి కృషి చేసిన కూటమి నాయకులకు కార్యకర్తలకు మహిళలకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలకు సుస్థిరమైన సుపరిపాలన నమ్మకమైన పాలన ఇస్తామని తెలిపారు.
Admin
Rapid TV