Rapid TV - Andhra Pradesh / Anakapally : జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో చోడవరం యం ఎల్ ఎ కె ఎస్ యన్ ఎస్ రాజు ఆధ్వర్యంలో స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో మెగా జాబ్ మేళా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ ప్రతి నిరుద్యోగుడికి ఏదో ఒక ఉపాధిని చూపించే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ జాబ్ మేళాలో 20 కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు హాజరయ్యారని ప్రతి ఒక్కరు వారికున్న అర్హతలు బట్టి ఆయా కంపెనీలలో జాయిన్ అవ్వాలని సూచించారు. కార్యక్రమంలో నియోజకవర్గం లోని ప్రజాప్రతినిధులు, డైరెక్టర్ గేదెలు సత్యనారాయణ జనసేన కూటమి నేతలు. పాల్గొన్నారు
Admin
Rapid TV