Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ ::: అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయం S.P దీపిక ఐపీఎస్ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ 100 రోజుల గంజాయి నిర్మూలన యాక్షన్ ప్లాన్ లో భాగంగా సిబ్బంది చేత ప్రతిష్ట నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. రావికమతం, చీడికాడ పోలీసు స్టేషన్ ల పరిధిలో రెండు వేర్వేరు కేసుల్లో 12,30,000 విలువ చేసే 246 కేజీల గంజాయిని పట్టుకొని 5 ముద్దాయిలను అరెస్టు చేశామని తెలిపారు. నిందితుల నుండి ఒక వేన్, ఒక ఆటో, ఒక ద్విచక్ర వాహనం, ఆరు సెల్ ఫోన్లు స్వాదీనం తీసుకున్నామని అన్నారు. నిందితుల్లో నలుగురు అల్లూరి జిల్లాకు చెందినవారని, ఒకరు కృష్ణా జిల్లా వ్యక్తి అని అన్నారు. గంజాయి కేసుల్లో పూర్తిస్థాయి విచారణ జరిపి అక్రమ రవాణాకు పాల్పడిన వారితోపాటు అమ్మకాలు కొనుగోలుకు పాల్పడుతున్న (కింగ్ ఫిన్) లను గుర్తించి వారిని త్వరలోనే అరెస్టులు చేస్తామని అన్నారు. ఈ గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితును అరెస్ట్ చేసిన సిబ్బందిని ఆమె ప్రశంసా పత్రాలతో అభినందించారు.
Admin
Rapid TV