Rapid TV - Andhra Pradesh / అనకాపల్లి : రాపిడ్ టీవీ సబ్బవరం:: కూటమి ప్రభుత్వం పుణ్యమా అని దిక్కు తోచని స్థితిలో రైతులు ఉన్నారని వైయస్సార్సీపి నాయకులు అదీప్ రాజ్ అన్నారు. సబ్బవరం వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ పేరుతో అన్ని విధాల రైతాంగాన్ని కుదేలు చేసిన నయవంచన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని, వైయస్సార్ ప్రభుత్వం ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేదని అన్నారు. అటువంటి ప్రభుత్వాన్ని మరలా చూడాలని ప్రజలు కలలు కంటున రోజులు అతి దగ్గరలోనే ఉందని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ యువనేత పైడివాడు సర్పంచ్ మోపాల అప్పారావు, సబ్బవరం మాజీ సర్పంచ్ ధనిమిది శ్రీనివాసరావు, ఆరిపాక సర్పంచ్ సురేష్ రాజు, ఇరు వారి సర్పంచ్ కనకరాజు, కోటాన రాము మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Rapid TV