Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి నర్సీపట్నం : నర్సీపట్నం రూరల్ సి ఐ ఎల్ రేవతమ్మ , కేడీపేట ఎస్సై తారకేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం సిహెచ్ నాగాపురంలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని సిహెచ్ నాగాపురం, పల్లావూరు, గ్రామస్తులు, భారీగా మహిళలతో పాతకృష్ణదేవిపేట వరకు గంజాయి నిర్మూలన అవగాహన ర్యాలీ (వాక్ తాన్ ) నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ రేవతమ్మ మాట్లాడుతూ, గంజాయి సేవనం, గంజాయి అక్రమ రవాణా వలన కేసులు ఎదుర్కొని జైలుకెళ్లడం వలన ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయన్నారు. అధిక ప్రభావం కలిగిన కేసులలో పిడి యాక్ట్ పెట్టి ఆస్తులు కూడా జప్తు చేయడం జరుగుతుందన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, కుటుంబ యజమాని మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా గృహిణులు ముఖ్యపాత్ర పోషించాలన్నారు. అంతేకాక సైబర్ మోసాలపై జాగ్రత్తలు, మహిళలపై జరిగే నేరాలు, నివారించే మార్గాలు, బాలలపై అఘాయిత్యాలు ( ఫోక్సో చట్టం ) తదితర అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణదేవిపేట, గొలుగొండ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Rapid TV