Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎలమంచిలి రాపిడ్ టీవీ:: ప్రజా ఆరోగ్యం పై వైద్యులు దృష్టి సాధించాలి ఎంపీపీ గోవింద్ ప్రజా ఆరోగ్యం పై దృష్టి సాధించాలని యలమంచిలి ఎంపీపీ గోవింద్ అన్నారు. శుక్రవారం రేగుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గోవిందు మాట్లాడుతూ ప్రస్తుతం వ్యాధులు సమయం కావడంతో అప్రమత్తం చేయడంతో పాటు పూర్తిస్థాయిలో వైద్యం అందించాలని సూచించారు. ఉన్న పరికరాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు అవసరమయ్యే పరికరాలను గుర్తించాలని సూచించాడు. వైద్యానికి సంబంధించిన పరికరాలను సమకూర్చేందుకు తమ వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కొల్లి త్రినాధరావు, మర్రి రాజబాబు, ఎడ్ల వాసు, వైద్యులు శిరీష, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV